byసూర్య | Tue, Jan 18, 2022, 05:36 PM
సంక్రాంతి వేళా టీఎస్ ఆర్టీసీ భారీ ఆదాయం ను రాబట్టింది. ఏకంగా పండగ సందర్భంగా రూ. 107 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తరపున ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రయాణికులు కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని మునుపటిలా ఆదుకోవాలని కోరారు. అయితే పండుగకు ముందు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.