byసూర్య | Fri, Jan 14, 2022, 04:00 PM
వానాకాలం సీజన్ లో రాష్ట్రం నుంచి కేంద్రం సేకరించనున్న ధాన్యం కోటా లక్ష్యం పూర్తయింది. ఇప్పటి వరకు 68.52 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు గాను 20 జిల్లాల్లో ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయింది. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే ఇంకా కొంత మేర సేకరించాల్సి ఉంది.