అమ్మో ఆశ దోస...అపడం:కరెన్సీ నోట్లు అనుకొని పరుగులు తీశారు

byసూర్య | Thu, Jan 13, 2022, 05:40 PM

ఆశ దురాశకు చేటు అంటారు. అప్పనంగా సొమ్ము వస్తుందంటే  పరుగులు తీసే రకం మన జనం. అలాంటి ఘటనయే మన హైదరాబాద్ నగరంలో నెలకొంది. హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో ఆసక్తికర ఘటన జరిగింది. కాకతీయ హిల్స్ ఏరియాలో రోడ్డుపై కరెన్సీ నోట్లు పడి ఉన్నాయన్న సమాచారం శరవేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు అక్కడికి పోటెత్తారు. దూరం నుంచి చూస్తే అవన్నీ 2 వేల రూపాయల నోట్లు లాగానే కనిపించాయి. దాంతో వాటిని తీసుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. కానీ వాళ్ల ఆశ అడియాస కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అవన్నీ పిచ్చి నోట్లు అని గుర్తించి తీవ్ర నిరాశకు గురయ్యారు. పాపం, వాహనాలపై వెళ్లే వాళ్లు కూడా ఆ నోట్ల కోసం రావడంతో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. అయితే, ఈ పరిస్థితిని గుర్తించిన పోలీసులు... వెంటనే ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. జనాలను అక్కడినుంచి పంపించివేశారు. పోలీసులు ఆ నోట్లను పరిశీలించి  అవి పిల్లలు ఆడుకునే పిచ్చి నోట్లు అని గుర్తించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM