ఆ ఊసులు అమలులో ఏక్క డ:షర్మిళ

byసూర్య | Thu, Jan 13, 2022, 05:41 PM

రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. చివరి గింజ వరకు కొంటానన్న ఊసే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. పెట్టుబడి రాక రైతులు చస్తూ ఉంటే మీరు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మీరు అన్నారని... రైతుల మీద మీకు ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారూ అని ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచుతానంటే నమ్మాలా? అని షర్మిల ప్రశ్నించారు. మొన్నటి వరకు మీ మెడ మీద కత్తి పెట్టి వడ్లు కొనబోమని రాయించుకున్నారన్న వాళ్ల మెడలు ఈరోజు మీరు వంచుతారా? ఎందుకు మీ రాజకీయ డ్రామాలు? అని ప్రశించారు. మీ అధికారం కోసం, మీ కుర్చీ కోసం మీరు ఆడుతున్న నాటకాలలో ఇది ఒక భాగమే తప్ప, మీకు రైతుల మీద ప్రేమ లేదని అన్నారు. రైతుల చావుల మీద మీకు సోయి లేదని దుయ్యబట్టారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM