తెలంగాణ రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం
byసూర్య |
Wed, Jan 12, 2022, 02:05 PM
తెలంగాణ రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత భూముల జాబితాలో (22ఏ) నమోదైన పట్టా భూముల్లో దాదాపు 2.80 లక్షల ఎకరాలకు విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లు మండలాల నుంచి నిషేదిత జాబితాలు తెప్పించుకున్న రెవెన్యూ శాఖ.. తొలి దశలో పరిష్కారానికి వీలుగా ఉన్న భూములను జాబితా నుంచి తొలగించారు. ధరణి పోర్టల్లోని జాబితా ఐచ్చికం లో సర్వే నెంబర్ ను పరిశీలించి.. తొలగించిన భూముల వివరాలు తెలుసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. ఆ రైతులకు పాసుపుస్తకం కూడా జారీ అవుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపినట్లు ప్రముఖ దినపత్రిక రిపోర్ట్ చేసింది.
Latest News