కేసీఆర్ మాట విని మీ క్రెడిబులిటి పోగొట్టుకోవద్దు: డీజీపీకి ఎంపీ అరవింద్

byసూర్య | Tue, Jan 11, 2022, 05:59 PM

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై డీజీపీ అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేసులు పెట్టమంటే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని విమర్శించారు. మీ ఎఫ్ఐఆర్ అతిగా ఉందంటూ కోర్టు కూడా తప్పుపట్టిందని, అనవసరంగా క్రెడిబిలిటీ కోల్పోవద్దని అన్నారు. మీకు చిత్తశుద్ధి ఉన్నట్టైతే... కేసులు పెట్టాలని కేసీఆర్ చెపితే రాజీనామా ఆయన మొహాన కొట్టి బీజేపీలోకి రావాలని డీజీపీని ఉద్దేశించి అరవింద్ అన్నారు. బీజేపీ మిమ్మల్ని రాజకీయ నాయకుడిని చేస్తుందని... టికెట్ కూడా ఇస్తుందని అన్నారు. ఏడాదిన్నరలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం పతనమవుతుందని చెప్పారు. ఒక మహిళా టీచర్ చనిపోతే చూడటానికి కూడా రాని కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ పదవి అవసరమా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కవితది కాదని అన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM