byసూర్య | Tue, Jan 11, 2022, 09:23 PM
ఈ నెల 17న ప్రగతి భవన్ ఎదుట నిరసన దీక్ష దిగుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఐదు ప్రధాన డిమాండ్లతో ప్రజా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఎల్ఆర్ఎస్తో అన్ఆథరైజ్డ్ లేఔట్ ప్లాట్లను రెగ్యులర్ చేయాలి అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు లక్ష రుణమాఫీని ఒకే విడతలో చెల్లించాలి అని, రుణమాఫీ ని నాలుగు విడతలుగా చెల్లించడం వల్ల మిత్తి కే సరిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకు పెన్షన్ ఇవ్వడం లేదు అని, మహిళా గ్రూపుల కు రుణాలే ఇవ్వడం లేదు అని జగ్గారెడ్డి విమర్శించారు.