మద్యం తాగడానికి డబ్బులివ్వలేదని దారుణం

byసూర్య | Fri, Nov 19, 2021, 09:08 AM

మద్యానికి బానిసైన ఓ కొడుకు తండ్రిపై తిరగబడ్డాడు. తండ్రిపై వంటనూనె పోసి నిప్పంటించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంద్రానగర్‌లో నివాసముంటున్న దుర్గారావు కుమారుడు నాగబాబు మద్యానికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు తెచ్చిన డబ్బును బెదిరించి దోచుకుని నిత్యం మద్యం సేవించే వ్యక్తి. ఇటీవల దుర్గారావు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కొడుకు నాగబాబు డబ్బు కావాలని తండ్రిని బెదిరించాడు. అయితే డబ్బులు లేకపోవడంతో తండ్రి దుర్గారావుపై వంటనూనె పోసి కొడుకు నిప్పంటించాడు. ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించి లోపలికి వెళ్లారు. తీవ్ర గాయాలపాలైన దుర్గారావును ఆస్పత్రికి తరలించారు. అయితే దుర్గారావు ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM