byసూర్య | Tue, Oct 26, 2021, 11:37 AM
విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తాళ్లబస్తీకి చెందిన స్వాతి (20) టెన్త్ చదివింది. సోమవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన స్వాతి తిరిగి రాలేదు. ఆమె తల్లిదండ్రులు స్వాతి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో స్వాతి అన్న అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్వాతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.