రూపాయితో రీఛార్జి అన్ని చెప్పి రూ. 11లక్షలు కొట్టేశారు

byసూర్య | Tue, Oct 26, 2021, 10:57 AM

రూపాయితో రీఛార్జి చేసుకోవాలని. లేకపోతే చరవాణి పని చేయదని చెప్పి రూ. 11 లక్షలు కాజేశారంటూ ఓ వయోవృద్దుడు సోమవారం హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై లచ్చిరెడ్డి చెప్పిన వివరాల ప్రకారం. నగరానికి చెందిన ఓ వృద్ధుడు(70)కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఓ నెట్‌వర్క్‌ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. కొన్ని గంటల్లో మీ సిమ్‌కార్డు సేవలు రద్దవుతాయని, వెంటనే రూపాయితో రీఛార్జి చేసుకోవాలని సూచించాడు. ఓ లింక్‌ పంపి వివరాలు పొందుపర్చాలన్నాడు. లింక్‌పై క్లిక్‌ చేసి, వివరాలన్నీ పొందుపరచగానే నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా వృద్ధుడి ఖాతాలోంచి విడతల వారీగా రూ. 11 లక్షలు విత్‌డ్రా అయ్యాయి. నిస్సహాయ స్థితిలో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM