byసూర్య | Tue, Oct 26, 2021, 10:57 AM
రూపాయితో రీఛార్జి చేసుకోవాలని. లేకపోతే చరవాణి పని చేయదని చెప్పి రూ. 11 లక్షలు కాజేశారంటూ ఓ వయోవృద్దుడు సోమవారం హైదరాబాద్ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై లచ్చిరెడ్డి చెప్పిన వివరాల ప్రకారం. నగరానికి చెందిన ఓ వృద్ధుడు(70)కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఓ నెట్వర్క్ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. కొన్ని గంటల్లో మీ సిమ్కార్డు సేవలు రద్దవుతాయని, వెంటనే రూపాయితో రీఛార్జి చేసుకోవాలని సూచించాడు. ఓ లింక్ పంపి వివరాలు పొందుపర్చాలన్నాడు. లింక్పై క్లిక్ చేసి, వివరాలన్నీ పొందుపరచగానే నెట్ బ్యాంకింగ్ ద్వారా వృద్ధుడి ఖాతాలోంచి విడతల వారీగా రూ. 11 లక్షలు విత్డ్రా అయ్యాయి. నిస్సహాయ స్థితిలో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.