byసూర్య | Tue, Oct 26, 2021, 11:02 AM
పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఇవాళ అట్టహాసంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఏకంగా 7 తీర్మానాలపై చర్చ నిర్వహించి ఆమోదం తెలిపింది. బీసీ జనగణన, ఎస్సీ వర్గీకరణ, చేయాలనే తీర్మానాలకు ఆమోదం తెలిపింది. అలాగే పార్టీ బైలాస్ లో పలు సంస్కరణలకు ప్లీనరీ ఆమోదం తెలిపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించేలా మార్పు చేస్తూ తీర్మానం చేసింది.