టీ20 వరల్డ్‌కప్‌-2021 భారత్‌-పాక్‌ మ్యాచ్: ఆ ముగ్గురి పేరు మీదే ఎ​క్కువ బెట్టింగ్‌లు!

byసూర్య | Sun, Oct 24, 2021, 12:21 PM

టీ20 వరల్డ్‌కప్‌-2021లో భాగంగా ఆదివారం ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. మరి... దాయాదుల పోరు అంటేనే భావోద్వేగాలు పెల్లుబికే సమయం కదా. అందుకే ఈ సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకునేందుకు బెట్టింగ్‌ రాయుళ్లు రెడీ అయిపోయారు. ఆన్‌లైన్‌ వేదికగా బెట్టింగ్‌ నిర్వహణకు తెరతీశారు.


ఇందులో భాగంగా... ఫస్ట్‌బాల్‌ నుంచి లాస్ట్‌బాల్‌ వరకు బెట్టింగ్‌లకు ప్లాన్‌ చేశారని సమాచారం. ఎవరు ఎంత కొడతారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు అనేదానిపై కూడా రేటు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీమిండియా స్టార్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, యువ సంచలనం రిషభ్‌ పంత్‌పైనే ఎక్కువ బెట్టింగ్‌లు వేస్తున్నట్లు సమాచారం.


ఆన్‌లైన్‌, బయట మార్కెట్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న తీరు


►ఆన్‌లైన్‌ మార్కెట్‌లో పాక్‌పై రూ. వెయ్యికి రూ. 1600


►బయట మార్కెట్‌లో భారత్‌పై రూ. వెయ్యికి రూ. 2 వేలు


►ఆన్‌లైన్‌ మార్కెట్‌లో భారత్‌పై రూ. వెయ్యికి రూ. 530


►బయట మార్కెట్‌లో పాక్‌పై రూ. వెయ్యికి రూ.4 వేలు


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM