byసూర్య | Sat, Jun 12, 2021, 03:20 PM
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నసందర్భంగా నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలతో కూడా.. కేసీఆర్ రాజీనామా చేయించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కరోనా, లాక్డౌన్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.