శంషాబాద్ విమానాశ్రయంలో 8 కిలోల హెరాయిన్ పట్టివేత.. రూ. 53 కోట్ల విలువ ఉంటుందని అంచన

byసూర్య | Sun, Jun 06, 2021, 09:41 AM

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. జాంబియాకు చెందిన మహిళ దోహా నుంచి నిన్న ఉదయం శంషాబాద్‌కు వచ్చింది. అనుమానాస్పదంగా కనిపించిన ఆమెను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆమె నుంచి 8 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీని మొత్తం విలువ రూ. 53 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. జాంబియాకు చెందిన నిందితురాలి పేరు ముకుంబా కరోల్‌ అని తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

చెరువులో నిర్మాణాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు Sat, Apr 27, 2024, 07:46 PM
ట్విట్టర్ ఎక్స్‌లో ఖాతా తెరిచిన KCR.. ఆ ముగ్గుర్నే ఫాలో అవుతోన్న గులాబీ బాస్ Sat, Apr 27, 2024, 07:45 PM
అవసరమైతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధం: బండి సంజయ్ Sat, Apr 27, 2024, 07:39 PM
మాజీ సీఎం కేసీఆర్‌ మీద పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు Sat, Apr 27, 2024, 07:34 PM
'సింగం' సినిమా రిపీట్.. ఇంటర్నేషనల్‌ సైబర్ రాకెట్‌ గుట్టు రట్టు చేసిన సిరిసిల్ల పోలీసులు Sat, Apr 27, 2024, 07:30 PM