byసూర్య | Sat, Jun 05, 2021, 11:02 AM
నిర్మల్ జిల్లాలోని కడెం మండలం లింగాపూర్లో టీఆర్ఎస్ జెడ్పీటీసీ వర్గీయులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా పోలీసులపైనే వారు దాడికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి సోదరుని భార్య రమాదేవి అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మృతి సమాచారం తెలుసుకుని సంఘటన గ్రామానికి వెళ్లిన పోలీసులపై జెడ్పీటీసీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఏఎస్ఐ సహా హోంగార్డుకు గాయాలు అయ్యాయి. పోస్టుమార్టం లేకుండానే మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. దాడికి సంబంధించి జెడ్పీటీసీ సహా 8మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.