పోలీసులపై టీఆర్ఎస్ జెడ్పీటీసీ వర్గీయుల దాడి

byసూర్య | Sat, Jun 05, 2021, 11:02 AM

నిర్మల్ జిల్లాలోని కడెం మండలం లింగాపూర్‌లో టీఆర్ఎస్ జెడ్పీటీసీ వర్గీయులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా పోలీసులపైనే వారు దాడికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి సోదరుని భార్య రమాదేవి అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మృతి సమాచారం తెలుసుకుని సంఘటన గ్రామానికి వెళ్లిన పోలీసులపై జెడ్పీటీసీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఏఎస్ఐ సహా హోంగార్డుకు గాయాలు అయ్యాయి. పోస్టుమార్టం లేకుండానే మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. దాడికి సంబంధించి జెడ్పీటీసీ సహా 8మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM