byసూర్య | Sat, Jun 05, 2021, 11:12 AM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని రైలు పట్టాల మధ్య చనిపోయిన జాతీయ పక్షి నెమలిని జీఆర్పీ పోలీసులు ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ కథనం ప్రకారం.. ఈనెల 4న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం నెంబరు 8లో హైదరాబాద్ వైపు రెండు పట్టాల మధ్య నెమలి చనిపోయి ఉంది. గమనించిన రైల్వే పోలీసులు ఫారెస్ట్ అధికారులు సునీత, సంజీవకు దాన్ని అప్పగించారు. రైలు ఢీకొని చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.