byసూర్య | Sat, Apr 10, 2021, 12:44 PM
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బాధితులకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్యం అందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యాలతో, మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యాజమన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. అలాగే ప్రవేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న కరోనా ట్రీట్ మెంట్ ఫీజులకు సంబంధించిన అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.