వనస్థలిపురంలో బాలికల కిడ్నాప్‌ కలకలం

byసూర్య | Sat, Apr 10, 2021, 12:26 PM

హైదరాబాద్‌: నగర శివార్లలోని వనస్థలిపురంలో ముగ్గురు బాలికల కిడ్నాప్‌ కలకలం రేపింది. వనస్థలిపురం పీఎస్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం నుంచి తమ కూతుళ్లు ఐశ్వర్య (17), ఆస్మా (15), అబీర్‌ (14) కనిపించట్లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రగతినగర్‌కు చెందిన రమేశ్‌, అతని స్నేహితులు కిడ్నాప్‌ చేసినట్లు బాధిత బందువులు ఆరోపించారు. గతంలో ఐశ్వర్యను ప్రేమిస్తున్నానని రమేశ్‌ వెంటపడుతుండటంతో పలుమార్లు హెచ్చరించినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

శుభకార్యంలో 25 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు.. ఇంటికి వచ్చి ఏంటీ దౌర్జన్యం? వీడియో వైరల్ Thu, Apr 25, 2024, 07:13 PM
ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. ఆరోజున జీతంతో కూడిన సెలవు Thu, Apr 25, 2024, 07:09 PM
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించిన ప్రముఖ సంస్థ Thu, Apr 25, 2024, 07:06 PM
ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM