byసూర్య | Wed, Apr 07, 2021, 12:48 PM
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడి తండాలో ఉద్యోగం లేదని మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తండావాసులు మంగళవారం నాడు తెలిపారు. తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్లోత్ మౌనిక(24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. మౌనిక పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుందని, ఉద్యోగం లేని కారణంగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.