byసూర్య | Thu, Apr 01, 2021, 08:08 AM
జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో శానిటేషన్ కార్మికుల చేపట్టిన సమ్మెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శానిటేషన్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులతో ఎంజీఎం అధికారులు పని చేయిస్తున్నారు. దీంతో శానిటేషన్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్మికులను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... దీక్ష చేస్తున్న శానిటేషన్ సిబ్బందితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.