తెలంగాణలో మూడు రోజులు వడగాలులు...!

byసూర్య | Wed, Mar 31, 2021, 11:44 AM

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మంగ‌ళ‌వారం 38.8 నుంచి 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమో‌ద‌య్యాయి. అత్యధికంగా కుమురం భీం ఆసి‌ఫా‌బాద్‌ జిల్లా రెబ్బెనలో 42.8 డిగ్రీ‌లుగా రికార్డయింది. తెలంగాణలో ఉత్తర దిశ‌నుంచి అతి తక్కువ ఎత్తులో గాలులు వీస్తు‌న్నా‌యని హైద‌రా‌బాద్ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. వీటి ప్రభా‌వంతో మూడు రోజుల పాటు ఆది‌లా‌బాద్‌, కుమురం భీం ఆసి‌ఫా‌బాద్‌, మంచి‌ర్యాల, నిర్మల్‌, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరి‌సిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యా‌పేట, మహ‌బూ‌బా‌బాద్‌, వరం‌గల్‌ రూరల్‌, వరం‌గల్‌ అర్బన్‌, జన‌గామ, మహ‌బూ‌బ్‌‌ న‌గర్‌, నాగ‌ర్‌‌ క‌ర్నూల్‌, వన‌పర్తి, నారా‌య‌ణ‌పేట, జోగు‌లాంబ గద్వాల జిల్లాల్లో పలుచోట్ల వడ‌గా‌లులు కొన‌సాగే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్ వాతా‌వ‌రణ కేంద్రం పేర్కొంది. హైద‌రా‌బా‌ద్ ‌లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM