byసూర్య | Wed, Jan 20, 2021, 01:26 PM
డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని రూ. 7లక్షలు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై ఎస్సార్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపూర్కు చెందిన ఎ. మోహనకృష్ణ ఎస్సార్నగర్లో ప్రణతి అనే పేరుతో బాయ్స్ హాస్టల్ నిర్యహిస్తున్నాడు. సనత్నగర్కు చెందిన తాగటారం సంతోష్ కుమార్(30)పదేళ్ల క్రితం మోహన్కృష్ణకు పరిచయం అయ్యాడు. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని సంతోష్ కుమార్ మోహన్కృష్ణను నమ్మించాడు. దీంతో మోహన్కృష్ణ లాక్డౌన్ సమయంలో రూ. 4 లక్షలు సంతోష్ కుమార్కు ఇచ్చాడు.కొన్ని రోజులకు డబుల్బెడ్ రూం ఇల్లు కేటాయించినట్లు అలాట్మెంట్ పత్రాలను ఇచ్చి, మోహన్కృష్ణ నుంచి మరో రూ. 3 లక్షలు తీసుకున్నాడు. మోహన్కృష్ణ అలాట్మెంట్ పత్రాలు తీసుకుని ఈసేవ కార్యాలయానికి వెళ్లగా అది నకిలీదని తేలింది. మోహన్కృష్ణ ఈ విషయమై సంతోష్ కుమార్ను నిలదీశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా అతడు స్పందించలేదు. దీంతో బాధితుడు మోహన్కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు సంతోష్ కుమార్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.