వారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు

byసూర్య | Wed, Jan 20, 2021, 01:46 PM

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. అర్హులైన వారు ఈ నెల ఆఖరు(జనవరి 31) వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రకటించారు. ఎస్సీ కులాల్లోని పేదలు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకోసం ప్రభుత్వం రూ.786 కోట్లు కేటాయించిందని, అందులో రుణాల రాయితీకి రూ.500 కోట్లు, బ్యాంకుల వాటా రూ.279 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ.7 కోట్లు అని చెప్పారు. వ్యవసాయ భూమి అభివృద్ధి, మైనర్‌ ఇరిగేషన్‌, విద్యుత్‌ కనెక్షన్లకు నేరుగా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ కులాల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఎస్సీ కులాల్లోని పేదలు, నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM