ఆ పసివాడు మృత్యుంజయుడు!

byసూర్య | Fri, Jan 15, 2021, 04:29 PM

ఒంటిపై చిన్న దెబ్బతగిలితేనే పసి ప్రాణాలు తట్టుకోలేవు. అలాంటిది ఏకంగా కారు రెండు టైర్ల మధ్యలో చిక్కుకొని కొంత దూరం ఈడ్చుకెళ్తే.. ఊహించలేకుండా ఉంది కదా! అవునండీ.. ఇలాంటి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. అయితే ఆ చిన్నారి తృటిలో తప్పించుకొని మృత్యుంజయుడిగా నిలిచాడు.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి ఉప్పర్‌పల్లిలోని అశోక్‌ విహార్‌లో ఓ చిన్నారి గేటు ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో సెల్లార్‌ నుంచి ఓ కారు బయటకు వెళ్తుతోంది. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారిని గమనించని కారు డ్రైవర్‌ కారుని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో కారు వెనకపైపు ఉన్న రెండు టైర్ల మధ్య ఇరుక్కుపోయిన చిన్నారిని కొంతమేర ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తృటిలో తప్పించుకున్నాడు. కానీ చిన్నారి ముఖం కుడిపైపు గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గమనించిన స్థానికులు చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అపార్ట్‌మెంట్‌లో ఉద్యోగులను దించేందుకు వచ్చిన వాహనంగా గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులుకు సమాచారం అందించారు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Latest News
 

రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM