byసూర్య | Fri, Jan 15, 2021, 03:53 PM
పతంగులు ఎగురవేస్తూ విద్యుత్ వైర్ కు చిక్కిన గాలిపటాన్ని తీయబోయి షాక్ గురై బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రంగరెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవేల్లిలో చోటుచేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం బైకను రాకేష్ (13) గాలిపటాలు ఎగురవేస్తున్న క్రమంలో గాలిపటం విద్యుత్ వైర్ కు చిక్కుకుంది. దాన్ని తీసుకునేందుకు ఇనుపరాడ్డును ఉపయోగించాడు.దీంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.రాకేష్ 8వ తరగతి చదువుతున్నాడు.