byసూర్య | Tue, Jan 12, 2021, 12:01 PM
వివేకానందుడి ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన బాటలో నడుద్దామని బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. తారానగర్ లో వివేకానంద జయంతి సందర్భంగా బిజెపి డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశీయులు మన దేశం మీద దండయాత్రలు చేసి మన సాంస్కృతిక చిహ్నాలు, దేవాలయాలను ధ్వంసం చేశారని, ఇప్పుడు స్వదేశంలో విదేశీ భావాలు కలిగి ఉన్న మూకలు పేట్రేగి ధ్వంస రచన చేస్తున్నారని మనం జాగరూకులం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో... బిజెపి చందానగర్ కాంటెస్టెడ్ అభ్యర్థి శ్రీమతి కసిరెడ్డి సింధు రెడ్డి, మియాపూర్ అభ్యర్థి కె. రాఘవేందర్ రావు, మాజీ ఫ్లోర్ లీడర్ గొల్లపల్లి కృష్ణారెడ్డి, నూనె సురేందర్, రాకేష్ దూబే, శివకుమార్ వర్మ, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీనివాస్ గుప్త, వేణుగోపాల్ పగడాల, అమరేంద్ర ప్రతాప్ సింగ్, శోభా దూబె తదితరులు పాల్గొన్నారు.