byసూర్య | Tue, Jan 12, 2021, 11:53 AM
తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే తెలంగాణలో సామాన్యులతోపాటు రాజకీయ నేతలు..సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఎమ్మెల్యేతోపాటు కూతురు శ్రేయ రెడ్డి, ఆయన గన్ మెన్ స్వామికి కూడా వైరస్ సోకినట్టు వెల్లడించారు. అయితే కరోనా లక్షణాలు అంతగా లేకపోవడంతో భూపాల్ రెడ్డి నారాయణఖేడ్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వారం రోజులపాటు ఐసోలేషన్లో ఉండాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు.