టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో కరోనా కలకలం..

byసూర్య | Tue, Jan 12, 2021, 11:53 AM

తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే తెలంగాణలో సామాన్యులతోపాటు రాజకీయ నేతలు..సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఎమ్మెల్యేతోపాటు కూతురు శ్రేయ రెడ్డి, ఆయన గన్ మెన్ స్వామికి కూడా వైరస్ సోకినట్టు వెల్లడించారు. అయితే కరోనా లక్షణాలు అంతగా లేకపోవడంతో భూపాల్ రెడ్డి నారాయణఖేడ్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వారం రోజులపాటు ఐసోలేషన్లో ఉండాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM