byసూర్య | Tue, Jan 12, 2021, 12:15 PM
వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో ఇసంపల్లి రాజేష్ అనే యువకుడు... అదే గ్రామానికి చెందిన అర్చనను ఆరు నెలలుగా ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్నాడు. అతడి వేధింపులు తీవ్రమవ్వడంతో అర్చన భరించలేకపోయింది. అర్చన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ విషయం గమనించిన ఆమె సోదరుడు హుటాహుటిన అర్చనను ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అర్చన మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజబాబు తెలిపారు.