byసూర్య | Sat, Jan 09, 2021, 01:16 PM
వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ మండలం ఎర్రవల్లి, నవాబుపేట్ మండలం చిట్టిగిద్దలో దాదాపు 45 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఒక్క సారిగా కళ్లుతిరిగి పడిపోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అంతుచిక్కని వ్యాధే కారణమని రెండు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆనంద్ డీఎంహెచ్వోతో మాట్లాడారు. ఎర్రవల్లి, చిట్టిగిద్దలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే కల్లుతాగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కృత్రిమ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.