సంగారెడ్డి జిల్లాలో దారుణం

byసూర్య | Thu, Oct 15, 2020, 11:37 AM

ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను మెడ నరికి అతి కిరాతకంగా హతమార్చారు. మహిళ మెడను ఓ చోట మొండెం మరో చోట వేశారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణ్‌ఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కిరాతకానికి ఒడిగట్టింది ఆమె భర్తేనని తెలిసింది. అనుమానంతో ఆమె తలనరికి హత్య చేశాడని సమాచారం. ఈ భయానక ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


ఈ పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల అనుసూజ (42), సాయిలు దంపతులు. భార్య అనుసూజ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త ప్రతికారంతో రగిలిపోయాడు. ఎలా అయిన భార్య అంతు చూడాలనుకున్నాడు. అదునుకోసం ఎదురు చూశాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం భార్య తలను నరికి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మొండాన్ని అనంతసాగర్‌లోనే వదిలేసి అనుసూజ తలను మాత్రం తీసుకువెళ్లి నారాయణఖేడ్‌లో నివాసం ఉంటున్న ఆమె ప్రియుడు జైపాల్‌రెడ్డి ఇంటి ఎదుట పడేశాడు.


అనంతరం భర్త సాయిలు వెళ్లి నారాయణఖేడ్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, ఘటనకు గల కారణాలను విచారిస్తున్నారు. హత్య జరిగి తీరుపై స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నారాయణఖేడ్‌లో ప్రియుడి ఇంటి వద్ద మహిళ తలను చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామాంతో వణికిపోయారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM