byసూర్య | Sat, Apr 04, 2020, 10:00 PM
ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ఐక్యత కార్యక్రమాన్ని విమర్శించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాది ఒవైసీ అని విమర్శించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాపై పోరాటానికి ప్రధాని మోడీ దీపం వెలిగించమంటే దానిని కూడా మతకోణంతో చూడటం ఒవైసీ అవివేకానికి నిదర్శనమన్నారు. వైద్యులకు కృతజ్ఞత తెలపడం ఒవైసీకి కనీసం తెలీదని, ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలని డీకె అరుణ హితవు పలికారు. దేశ ఐక్యతకు మోడీ ఈ కార్యక్రమంకు పిలుపునిచ్చారని డీకే అరుణ గుర్తు చేశారు.