byసూర్య | Sat, Apr 04, 2020, 01:09 PM
ప్రముఖ రిటైల్ సంస్థ వాల్మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ మార్కెట్ ఫ్లిప్కార్ట్ తన ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత విధించమని, వారి ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రకటించింది. కరోనావైరస్ నేపధ్యంలో దేశంలో 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఈ-కామర్స్కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు. దీంతో కంపెనీకి సంబంధించిన ఆరు వేల మంది ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంస్థ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నందున వారికి జీతాలు చెల్లిస్తామని ఫ్లిప్కార్ట్ సీఈఓ కల్యాన్ కృష్ణమూర్తి ప్రకటించారు.