byసూర్య | Sat, Apr 04, 2020, 01:17 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం 5న రాత్రి 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ నగర ప్రజలంతా దీపాలు వెలిగించాలని నగర మేయర్ బొంతు రామ్మెహన్ కోరారు. కరోనా వైరస్ పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించే కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తున్న గొప్ప పోరాటం స్ఫూర్తి వంతంగా సాగాలని హైదరాబాద్ నగర మేయర్ అభిలషించారు.