byసూర్య | Mon, Mar 30, 2020, 02:16 PM
కరోనా వైరస్ దృష్ట్యా తెలంగాణలో రేపటి నుంచి జరగాల్సిన టెన్త్ వాయిదా పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ నెల 23 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఎగ్జామ్స్ ను రీ షెడ్యూల్ చేయాలని హైకోర్టు ఇటీవలే ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈవాళ్టి వరకు పరీక్షలను ఎస్సెస్సీ బోర్డు వాయిదా వేసింది. అయితే లాక్ డౌన్ దృష్ట్యా రేపటి నుంచి ఏప్రిల్ 6వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలను మళ్లీ వాయిదా వేస్తున్నామని.. పరీక్షల తేదీలను తర్వాత వెల్లడిస్తామని డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.