byసూర్య | Mon, Mar 30, 2020, 02:10 PM
కరోనా నియంత్రణకు తెలంగాణ సర్కార్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎలాంటి పరిస్థితినినైనా ఎదుర్కోనుందేకు సర్కార్ రెడీగా ఉంది. అయితే ముందస్తుగానే వైద్య సిబ్బందిని నియమించుకునేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉద్యోగ నియమాకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లను కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో ఉన్న వారితో పాటు రిటైర్ అయిన మెడికల్ సిబ్బంది కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 ఏప్రిల్ 3 చివరి తేదీ. అభ్యర్థులు దరఖాస్తులో వెల్లడించిన జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత నియమించుకుంటారు. ఆసక్తి గల అభ్యర్థులు health.telangana.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాలని ఆరోగ్య శాఖ తెలిపింది.