byసూర్య | Fri, Jan 17, 2020, 04:39 PM
హై ప్రొఫైల్ ఉన్న ముగ్గురు మహిళా ఆర్టిస్టులతో పాటు ఓ మైనర్ను సెక్స్ రాకెట్లో పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని అంధేరీలో ఓ 3 స్టార్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేర అంధేరీ తూర్పు పోలీసులు హోటల్ పై గురువారం దాడి చేశారు.
'ఈ దాడిలో ముగ్గురు మహిళలు, ఓ మైనర్లతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లుగా తెలిసింది. దీనిని ప్రియా శర్మ అనే మహిళ నిర్వహిస్తున్నట్లుగా తెలిసి ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. ప్రియా శర్మ కండీవలీ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా సమాచారం. దాంతో పాటు మరికొన్ని అసాంఘిక కార్యకలాపాల్లోనూ ఆమె ఇన్వాల్స్ అయి ఉంది' అని ఎస్ఎస్ బ్రాంచ్ సీనియర్ ఇన్స్పెక్టర్ సందేశ్ రావలె తెలిపారు.
ఈ ఘటనలో దొరికిన వారిలో ఓ మహిళా యాక్టర్ కమ్ సింగర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ మహిళ సావదాన్ ఇండియా టీవీలో క్రైమ్ షోకు హోస్ట్ గా పనిచేస్తుంది. మరో మహిళ మరాఠీ మూవీలతో పాటు సీరియల్స్లో నటిస్తుంది. మైనర్ వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఈ నేరంలో ప్రియా శర్మనే నిందితురాలిగా పరిగణిస్తూ కేస్ ఫైల్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.