byసూర్య | Thu, Jan 16, 2020, 12:08 PM
హుజురాబాద్ లో మంత్రి ఈటెల రాజేందర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే అభ్యర్ధులకు శ్రీ రామరక్ష అని అన్నారు. టిఆర్ఎస్ గెలిచే పార్టీ, కాంగ్రెస్,బీజేపీలు ఓడిపోయే పార్టీలు అన్నారు. ఓడిపోయే పార్టీలకు ఓటేస్తే ప్రయోజనం ఉండదు. హుజురాబాద్, జమ్మికుంటను టిఆర్ఎస్ ప్రభుత్వమే అభివృద్ధి చేసింది. కారు గుర్తుకు ఓటేసి ప్రభుత్వానికి అండగా నిలవాలి అని అన్నారు