byసూర్య | Mon, Jan 13, 2020, 01:09 PM
జగిత్యాల పట్టణానికి చెందిన అయ్యప్ప దీక్షపరుడు కేరళలోని శబరిమలైలో ఆకస్మికంగా మృతి చెందాడు. కొత్త బస్స్టాండ్ వద్ద నివాసం ఉంటున్న శ్రీగంధం రమేష్ శబరమలైలో పంబా నది వద్ద స్నానం చేస్తుండగా బ్రెయిన్ డెడ్తో మృతి చెందాడు. రమేష్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 9న అయ్యప్ప దర్శనానికి బయలుదేరి వెళ్లారు. రమేష్ మృతి వార్త తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.