డ్రగ్స్ వ్యవహారం...అందరికి క్లీన్‌ చిట్‌

byసూర్య | Mon, Jan 13, 2020, 12:41 PM

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు బయటపడ్డారు. ఈ కేసులో వాళ్లందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు. డ్రగ్స్ వాడిన సినీ ప్రముఖులందర్నీ బాధితులుగా చార్జిషీట్‌లో పేర్కొంది ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌.  నాలుగేళ్ల క్రితం నానా హంగామా చేసిన సిట్ ఇప్పుడు కేసులో అందరూ బాధితులే స్పష్టం చేయడం గమనార్హం. నిజానికి రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఇందులో సినీ నటులు, దర్శకులు, ఇతర ప్రముఖులకు సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో మీడియా చానెల్స్ లైవ్ కవరేజీలతో ఈ వ్యవహారానికి  ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. అగ్రతారలు సైతం డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు. తాజాగా స.హ. చట్టం ద్వారా వెలుగు చూసిన వివరాల ప్రకారం ఈ కేసుతో సంబంధం ఉన్న సినీ ప్రముఖులు, కొందరు ఇతరులకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. దీని ప్రకారం ఛార్జిషీట్‌లో సినీ ప్రముఖులు నిందితులు కాదని, బాధితులని పేర్కొన్నారట. అంతే కాదండోయ్ ఆరోజున విచారణ నిమిత్హం పిలిచి సేకరించిన నమూనాలకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు కోర్టుకు చేరలేదట. అయితే గతంలో కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇలాంటి వార్తలే వచ్చాయి. దీంతో వాటిలో వాస్తవం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు ఖండించారు. మేం ఎవరికి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని అన్నారు. మరో ఇప్పుడు ఏమంటారో చూడాలి.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM