రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Mon, Jan 13, 2020, 12:18 PM

సీఎం సీటు విషయంలో కేసీఆర్‌కు ఇంటిపోరు పెరిగిందని చెప్పారు. కేటీఆర్ సీఎంకు అర్హుడని ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ వాక్యాలను ఎందుకు హరీష్ రావు, ఈటల ఎందుకు సమర్ధించడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో ముసలం ప్రారంభమైందని,ఉద్యమ ద్రోహులు కేటీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఉద్యమకారులు ప్రజల వైపు ఉన్నారని అన్నారు.టీఆర్ఎస్‌ ఉద్యమద్రోహులు, ఉద్యమకారులు అని రెండు జట్లుగా విడిపోయాయని విమర్శించారు.మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో కేటీఆర్‌ ఆశిస్తున్న సీఎం సీటుకు లింకు పెట్టారని చెప్పారు. ఏ మునిసిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ కట్టించారు?57 సంవత్సరాల వారికి పెన్షన్ ఇస్తున్నారని నిరూపిస్తే ఆ మునిసిపాలిటీలో పోటీ చేయమని అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఇంటి బిల్లు, నల్లా, విద్యుత్తు బిల్లులను పెంచుతుందని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే మునిసిపాలిటీలను అభివృద్ధి చేస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM