byసూర్య | Mon, Jan 13, 2020, 12:18 PM
సీఎం సీటు విషయంలో కేసీఆర్కు ఇంటిపోరు పెరిగిందని చెప్పారు. కేటీఆర్ సీఎంకు అర్హుడని ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ వాక్యాలను ఎందుకు హరీష్ రావు, ఈటల ఎందుకు సమర్ధించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్లో ముసలం ప్రారంభమైందని,ఉద్యమ ద్రోహులు కేటీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఉద్యమకారులు ప్రజల వైపు ఉన్నారని అన్నారు.టీఆర్ఎస్ ఉద్యమద్రోహులు, ఉద్యమకారులు అని రెండు జట్లుగా విడిపోయాయని విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కేటీఆర్ ఆశిస్తున్న సీఎం సీటుకు లింకు పెట్టారని చెప్పారు. ఏ మునిసిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ కట్టించారు?57 సంవత్సరాల వారికి పెన్షన్ ఇస్తున్నారని నిరూపిస్తే ఆ మునిసిపాలిటీలో పోటీ చేయమని అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ఇంటి బిల్లు, నల్లా, విద్యుత్తు బిల్లులను పెంచుతుందని, కాంగ్రెస్ను గెలిపిస్తే మునిసిపాలిటీలను అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు