byసూర్య | Mon, Oct 14, 2019, 04:10 PM
తెలంగాణలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి సంబంధించి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నియామకానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. సోమవారం ఉదయం నుంచి అన్ని డిపోల దగ్గర తాత్కాలిక ఉద్యోగుల నియామకం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ ద్వారానే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. డిపో దగ్గర అప్లికేషన్ ఫాంలను అధికారులు జారీ చేస్తున్నారు. వాటిని అభ్యర్ధులు నింపి వెంటనే అధికారులకు సమర్పిస్తున్నారు. నియామకాలు పారదర్శకంగా జరుగుతాయని అధికారులు తెలిపారు. ఇప్పుడు తీసుకునే ఉద్యోగులంతా తాత్కాలిక ప్రాతిపదికనే అని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఆర్టీసి ఉద్యోగులు సమ్మె విరమించి వస్తే ఏ క్షణంలోనైనా రిలీవ్ కావాల్సి ఉంటుందన్న సమాచారాన్ని కూడా అధికారులు అభ్యర్ధులకు తెలిపినట్టు తెలుస్తోంది.