byసూర్య | Mon, Oct 14, 2019, 04:08 PM
హైదరాబాద్ : ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస మృతికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస రెడ్డి మృతి తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.