byసూర్య | Mon, Oct 14, 2019, 04:07 PM
నిజామాబాద్ : అబార్షన్ వికటించి ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని యువకుడు నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అతనికి శారీరకంగా దగ్గరైంది. దీంతో సదరు యువతి గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న యువకుడు.. యువతికి అబార్షన్ చేయించేందుకు ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. వైద్యం చేస్తుండగా వికటించి యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా నగరిలోని అర్బన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థినికి ఆమె ప్రియుడు విజయ్ అబార్షన్ చేయిస్తుండగా.. అది వికటించి విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే.