byసూర్య | Mon, Oct 14, 2019, 12:47 AM
సోమవారం ఆర్టీసి కార్మిక సంఘాలు ఇచ్చిన ఖమ్మం జిల్లా బంద్ కు కాంగ్రెస్ పార్టీ తన సంపూర్ణ మద్దతిచ్చినట్టు ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో కూడా ఇంకా బలిదానాలు జరగటం బాధాకరమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేసారు. నీళ్లు నిధులు నియామకాలకోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను తీసివేస్తాం అనడం కేసీఆర్కి ఉన్న అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజల ఆస్తిని ఎవరికో ధారాదత్తం చేసేందుకే ఆర్టీని దివాలా తీయించే పనిలో ఉన్నాడని, దీని చూస్తూ ఊరుకునేది లేదు, ఎంతకైనా పోరాడతామన్నారు. కేసీఆర్ నియంతలగా, ప్రజలు నీకు బానిసలుగా చేస్తున్నావ్ ఖబర్దార్ కేసీఆర్....
చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్మికుల పై మఫ్టీలో వచ్చి అక్రమంగా కొట్టిన సి ఐ రమాకాంత్ ను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేసిన విక్రమార్క... లాఠీలతో ముందుకు వస్తే ప్రజలు మీకు బుద్ధిచెప్పే రోజు ఉంటుందని హెచ్చరించారు.