byసూర్య | Mon, Oct 14, 2019, 12:53 AM
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ఆత్మహత్య కాదని ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు. ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్ తగులుతుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. ఆదివారం ఆయన గాంధీ భవన్లో మీడియాలో మాట్లాడుతూ నిన్న సమ్మెలో పాల్గొంటూ ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కంచన్బాగ్ లోని అపోలో హాస్పిటల్ లో మృతి చెందటం అత్యంత విషాదకరం అన్నారు. ఈ వార్త తనని తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూన్నట్టు తెలిపారు. త్వరలో ఆ కుటుంబాన్ని కలసి పార్టీ తరపున సహాయం అందిస్తామని చెప్పారు. ఆర్టీసీకార్మికులు ఎవరు ధైర్యం కోల్పోవద్దని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పొన్నం చెప్పారు.