byసూర్య | Sun, Oct 13, 2019, 04:42 PM
జగిత్యాల జిల్లాలో ఓ రైతు ఆదివారం పాముకాటుకు బలయ్యాడు. మెట్ పెల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన గాజుల రాజం (60) రైతు పాము కాటుతో మృతి చెందాడు. మొక్కజొన్న చేనులో పనులు చేస్తుండగా.. పాము కాటు వేసింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.