byసూర్య | Sun, Oct 13, 2019, 04:26 PM
తిమ్మాపూర్ దిగువ మానేరు ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా ఆదివారం నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. స్టేజ్-1, స్టేజ్ -2 ద్వారా నీటిని వదిలామని పేర్కొన్నారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కడా కాలువకు గండి పెట్టొద్దని కోరారు. నీటిని సద్వినియోగం చేసుకుంటే రబీ పంటలకు కూడా నీరు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.