byసూర్య | Sat, Oct 12, 2019, 04:48 PM
తెలంగాణలో దసరా సెలవులను ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించనుంది. ఈ నెల 19 వరకు దసరా సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సిలబస్ నష్టపోకుండా రెండో శనివారం స్కూళ్లు నడపాలని ఆదేశించారు.