byసూర్య | Sat, Oct 12, 2019, 04:35 PM
హైదరాబాద్: మూడు రోజుల్లో వందకు వందశాతం ఆర్టీసీ బస్సులు నడిపి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలన్నారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గుర్తించదు. సమ్మె చేస్తున్నవారితో చర్చలు కూడా జరపదని తేల్చి చెప్పారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహిస్తున్న వారికి సంబంధించిన సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని ఆదేశించారు.