byసూర్య | Sat, Oct 12, 2019, 05:53 PM
ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ తీరుతో మనస్తాపం చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం సాయంత్రం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. డ్రైవర్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వద్దకు భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆస్పత్రి వద్ద భారీ ఎత్తున మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.